విశాలాంధ్ర – పెద్దకడబూరు :(కర్నూలు) : సమయపాలన పాటించని సచివాలయ సిబ్బందిపై అధికారులు చర్యలు తీసుకోవాలని జాలవాడి గ్రామ టిడిపి అధ్యక్షులు ముక్కన్న డిమాండ్ చేశారు. బుధవారం మండల పరిధిలోని జాలవాడి గ్రామంలో ఉదయం 10.30 గంటలైనా సచివాలయ తాళాలు తెరుచుకోవడం లేదన్నారు. సమస్యల పరిష్కారానికై గ్రామస్తులు సచివాలయానికి వస్తే సిబ్బంది కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. సాయంత్రం సైతం సమయం అవ్వకముందే సచివాలయానికి తాళాలు వేస్తారన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమయపాలన పాటించని సచివాలయ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.