విశాలాంధ్ర,పార్వతీపురం:పార్వతీపురం జాయింట్ కలెక్టర్ గా ఎస్ ఎస్ శోబిక గురువారం బాధ్యతలు చేపట్టారు.జిల్లాకలెక్టర్ కార్యాలయానికి విచ్చేసిన ఆమెకు జిల్లారెవిన్యూఅధికారి జి కేశవ నాయుడు, పార్వతీపురం, పాలకొండ్ రెవిన్యూ డివిజనల్ అధికారులు కె హేమలత, ఏ వెంకటరమణలు, జిల్లా కలెక్టర్ కార్యాలయ సిబ్బంది పుష్ప గుచ్చెంలు అందజేసి ఘనస్వాగతం పలికారు. జాయింట్ కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన శోబిక మాట్లాడుతూ ప్రభుత్వ అభివృద్ది సంక్షేమపథకాలు, జిల్లాలో కొనసాగుతున్న కార్యక్రమాలు కొనసాగించుటకు తనవంతు కృషి చేస్తానని తెలిపారు. జాయింట్ కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన శోబికకు జిల్లాల్లోని తహశీల్దార్లు, పలువురు జిల్లాఅధికారులు, కలెక్టరేట్ ఉద్యోగులు, సిబ్బంది కలిసి అభినందనలు తెలిపారు.