పంచాక్షరీ మహా మంత్రంతో పోటెత్తిన శివ భక్తులు ….
విశాలాంధ్ర – చోడవరం (అనకాపల్లి జిల్లా) : తే08.03.2024ది. రాష్ట్రంలోని చరిత్ర ప్రసిద్ధి పొందిన ప్రముఖ స్వయం భూ శైవ క్షేత్రాల్లో ఒక్కటైన అనకాపల్లి జిల్లా చోడవరం స్వయం భూ పురాణ గంగా సమేత శ్రీ గౌరీశ్వర స్వామి దేవాలయం, చుట్టుప్రక్కల శివాలయాల్లోను మహాశివరాత్రి సందర్భంగా శుక్రవారం వేకువ జాము నుండే భక్తులు, ప్రముఖులతో కిట కిట లాడుతున్నాయి. శివ పంచాక్షరి మహా మంత్రంతో పరమ శివుని దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. వేకువ జాము నుండి పంచామృత సహిత మహాన్యాస పూర్వక రుద్రాభషేకం, రుద్ర హోమం తదితర వేద క్రతువులు నిర్వహించినట్లు ఆలయ ప్రధాన అర్చకులు కొడ మంచలి చలపతిరావు, షణ్ముఖ శాస్త్రి (శ్రీనివాస్)లు తెలిపారు.
అనకాపల్లి జిల్లా చోడవరంలో సుమారు వేయి సంవత్సరాల కు పైగా చరిత్ర కలిగి, చోళ రాజుల పాలనలో నిర్మించబడ్డ శ్రీ స్వయం భు గౌరీ పరమేశ్వర ఆలయంలో స్వామి దర్శనం చేసుకుంటే కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. అత్యంత మహిమాన్వితమైన మహా శివరాత్రి పర్వదినం నాడు స్వయం భూ గంగా సమేత గౌరీశ్వరుని దర్సనం కోసం జిల్లా నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు. ఎండోమెంట్ ఈ.వో సత్యనారాయణ మాట్లాడుతూ ముందుగా భక్తులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలుపుతూ,
భక్తులకు దర్శనాలు, తీర్థ ప్రసాదాలు, క్యూ లైన్ టెంట్లో అవసరమైన అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు.