విశాలాంధ్ర ధర్మవరం:: ప్రతి ఒక్కరూ భక్తి భావాన్ని పెంపొందించుకున్నప్పుడే జీవితం సుఖవంతంమవుతుందని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని శివానగర్లో అతి పురాతమైన శ్రీ బచ్చు నాగంపల్లి కాశీ విశ్వనాథ స్వామి ఆలయంలో రథోత్సవం కడువైభవంగా సాగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా విచ్చేశారు. శివనామ స్మరణతో ధర్మవరం పట్టణం పులకరించింది. వేలాదిమంది భక్త జన సందోహం మధ్య కదిలిన రథోత్సవం భక్తాదులను మరింత ఉత్సాహపరిచింది. తదుపరి ఎమ్మెల్యే కేతిరెడ్డి దంపతులు రతాన్ని లాగారు. తొలుత పార్వతీ పరమేశ్వరులకు ఎమ్మెల్యే దంపతులు పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ వారు ఎమ్మెల్యే దంపతులకు ఘనంగా స్వాగతం పలికారు. మధ్యాహ్నం వరకు ఆలయం వద్దనే రథాన్ని ఉంచడంలో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి పూజలు చేశారు. ఎమ్మెల్యే దంపతులతో పాటు భక్తాదులు వార్డు కౌన్సిలర్లు రథాన్ని రాగుతూ శివానగర్ లోని దిమ్మిల సెంటర్ వరకు రతాన్ని లాగారు. ఈ రథాన్ని లాగుతుండడంతో ప్రజలు భక్తులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. అర్షద్వానాల మధ్య శివ నామస్మరణతో కార్యక్రమం మారుమొగింది. రథోత్సవాన్ని తిలకించేందుకు పట్టణ ప్రజలు వేల సంఖ్యలో తరలివచ్చారు. ఈ కార్యక్రమానికి ఆలయ కమిటీ వారు భక్తాదులకు ఎటువంటి అసౌకర్యము కలగకుండా అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. వన్ టౌన్ సిఐ సుబ్రహ్మణ్యం బందోబస్తు కూడా నిర్వహించారు.