విశాలాంధ్ర – పెద్దకడబూరు :(కర్నూలు) ; మండల కేంద్రమైన పెద్దకడబూరులోని కస్తూరి బా గాంధీ గురుకుల విద్యాలయంలో 2024-25 విద్యా సంవత్సరానికి గాను 6వ తరగతి, ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశానికి అర్హులైన బాలికలు ఆన్లైన్ ద్వారా ధరఖాస్తు చేసుకోవచ్చునని కేజీబీవీ ప్రత్యేక అధికారిణి రుక్సానా పర్వీన్ తెలిపారు. శనివారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ 6వ తరగతికి మండలంలోని డ్రాపౌట్ అయిన బాలికలు, ఇంటర్ మొదటి సంవత్సరంలో ఎంపీసీలో చేరేందుకు ఈ నెల 12 నుండి ఆన్ లైన్ లో ధరఖాస్తు చేసుకోవాలన్నారు. వివరాలకు 8341012231 ఫోన్ నెంబరు ను సంప్రదించాలని ఆమె కోరారు.