జెరూసలేం: పలస్తీనా భూభగంలో మానవతా సాయాన్ని ఎయిర్ డ్రాప్ చేసిన క్రమంలో దుర్ఘటన చోటుచేసుకుంది. పారాచూట్ తెరుచుకోని కారణంగా ఐదు మరణాలు సంభవించాయి. మరో 10 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను అల్ షిఫా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన అల్ షాతి శరణార్థి శిబిరం సమీపంలో జరిగింది. ‘సహాయ సామాగ్రితో కిందకు దిగే క్రమంలో పారాచూట్ తెరుచుకోలేదు. అది ఓ రాకెట్ మాదిరిగా కిందకు దూసుకొచ్చింది. నివాస ప్రాంతంలో కూలింది. దీంతో అక్కడిక్కడ ముగ్గురు చనిపోయారు’ అని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఐదు నెలలుగా దుర్భర పరిస్థితులను అనుభవిస్తున్న గాజా ప్రజల కోసం ఉత్తర గాజాలో సహాయ సామాగ్రిని అమెరికా, జోర్డాన్ సహా అనేక దేశాలు పంపుతున్నాయి. సామాగ్రిని ఎయిర్ డ్రాప్ చేస్తున్నాయి. అయితే సాంకేతిక సమస్య తలెత్తడం వల్ల ఈ ఘటన జరిగిందని అధికారులు తెలిపారు. జోర్డాన్ నాలుగు విమానాల ద్వారా ‘ఎయిర్ డ్రాప్’ చేపట్టినట్లు వెల్లడిరచారు.