విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని కే పి టి వీధిలో గల చక్రవర్తి థియేటర్ ఎదురుగా ఉన్న శ్రీ స్వయంభు కాలభైరవ స్వామి ఆలయంలో అమావాస్య పూజలు కుష్మాండ దీపోత్సవ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా పూజారి ధనుంజయ ఆచారి నిర్వహించారు. ఈ సందర్భంగా ధనుంజయ ఆచారి కాల భైరవ స్వామిని ప్రత్యేక పూజలతో పాటు ప్రత్యేక అలంకరణ గావించిన వైనం భక్తాదులను విశేషంగా ఆకట్టుకుంది. అమావాస్య రోజున ఇటువంటి కార్యక్రమాలు నిర్వహణ పట్ల కుటుంబంలో అన్ని దోషాలు తొలగి మంచి జరుగుతుందని అర్చకులు తెలిపారు. తదుపరి మంగళహారతి తో పాటు అన్నప్రాసాధ సేవా కార్యక్రమం కూడా నిర్వహించామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ సేవ బృందంతో పాటు అధిక సంఖ్యలో భక్తాదులు పాల్గొన్నారు