చంద్రబాబు పేరు చెప్తే గుర్తుకొచ్చే ఒక్క పథకమైనా ఉందా..?
-ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి
విశాలాంధ్ర-రాప్తాడు : మరోసారి ప్రజలను మోసం చేసేందుకు బాబు, పవన్, మోడీ జతకట్టారని ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి విమర్శించారు. మండల కేంద్రం రాప్తాడులో వైయస్సార్ చేయూత కార్యక్రమంలో భాగంగా సోమవారం డ్వాక్రా మహిళలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరయ్యారు. జడ్పీ చైర్మన్ బోయ గిరిజమ్మ, తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డి, జడ్పిటిసిలు పసుపుల హేమావతి, చంద్రకుమార్, ఎంపీపీలు చిట్రెడ్డి జయలక్ష్మి, గుజ్జల వరలక్ష్మి, నరసింహగౌడ్ హాజరయ్యారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ డ్వాక్రా మహిళల అప్పులు మాఫీ చేస్తానని ఓట్లు వేయించుకుని మాఫీ చేయకుండా బాబు మోసం చేశాడన్నారు. చంద్రబాబు పేరు చెప్తే గుర్తుకొచ్చే ఒక పథకమైనా ఉందా..? ని మహిళలను అడిగారు. అధికారంలోకి వచ్చిన వెంటనే వైయస్సార్ ఆసరా పథకం కింద డ్వాక్రా రుణాలను మాఫీ చేసిన ఘనత సీఎం జగన్ కు దక్కుతుందన్నారు. కేసులు మాఫీ చేసుకునేందుకే బిజెపితో చంద్రబాబు పొత్తు పెట్టుకున్నాడని.. రాష్ట్రంలో దొంగలంతా ఏకమయ్యారని… భూములను దోచుకునేందుకు అక్రమార్కులను టిడిపిలోకి ఆహ్వానిస్తున్నాడన్నారు. 14 ఏళ్లు సీఎంగా చంద్రబాబు రాష్ట్రానికి ఏమి అభివృద్ధి చేశారని మళ్ళీ ఓటు ఆడిగేందుకు వస్తున్నారని ప్రశ్నించారు. పదేళ్లుగా మంత్రిగా పనిచేసిన పరిటాల సునీత ఏం చేసిందో చెప్పాలన్నారు. నిరుపేదలకు ఇల్లు మంజూరు చేస్తుంటే కొంతమంది ద్వారా
కోర్టులకు వెళ్లి అడ్డుకుంటున్నారన్నారు. వ్యవస్థలను చేతిలో పెట్టుకున్న చంద్రబాబును ఓటు ద్వారా ఇంటికి పంపిద్దామన్నారు. అన్ని వర్గాల సంక్షేమం కోసం కృషిచేసిన జగనన్నను మరోసారి సీఎంగా గెలిచేందుకు ఆశీర్వదించాలన్నారు. పేద వర్గాలన్నీ ఏకమై జగనన్నకు మళ్ళీ మీ ఆశీస్సులు అందిస్తే వచ్చే ఎన్నికల్లో 175 సీట్లు కూడా గెలుస్తామన్నారు. రాప్తాడు ఎమ్మెల్యేగా తనను కూడా మరోసారి గెలిపించాలని కోరారు. అనంతరం వైఎస్ఆర్ చేయూతకు సంబంధించిన మెగా చెక్కును విడుదల చేశారు. కార్యక్రమంలో ఎంపీడీఓ గీతావాణి, కన్వీనర్ జూటూరు శేఖర్, ఎన్నికల ఇంచార్జి చిట్రెడ్డి సత్తిరెడ్డి, మరూరు ఆది, అగ్రి బోర్డు కేశవరెడ్డి, ఏపీఎంలు నల్లప్ప, నీలారెడ్డి, వైస్ ఎంపీపీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.