విశాలాంధ్ర-అనంతపురం రూరల్ : రైతులకు, ప్రజలకు నాణ్యమైన విద్యుత్తు సరఫరా చేయడమే లక్ష్యమని ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అన్నారు. అనంతపురం రూరల్ మండలం కోడిమి, ఉప్పరపల్లి గ్రామాల్లో నూతనంగా ఏర్పాటు చేసిన విద్యుత్ సబ్ స్టేషన్లను సోమవారం ప్రారంభించారు. కొడిమి గ్రామంలో విద్యుత్ సబ్ స్టేషన్ తో పాటు గ్రామ సచివాలయ భవనం, రైతు భరోసా కేంద్రం, వెల్ నెస్ సెంటర్ ను కూడా ప్రారంభించారు. వైసీపీ పాలనలో అన్ని వర్గాల సంక్షేమం కోసం సీఎం జగన్ అహర్నిశలు కృషి చేశారన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ జూటూరు చంద్రకుమార్, ఎంపీపీ గుజ్జల వరలక్ష్మి, వైస్ ఎంపీపీలు, కన్వీనర్లు గోవిందరెడ్డి, రాధమ్మ, నాయకులు బండి పవన్, ధనుంజయ యాదవ్, సర్పంచులు సావిత్రి శ్రీనివాసులు, సుబ్బిరెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.