Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

పదోతరగతిలోశతశాతంపలితాలు సారించాలి:డ్వామాపిడి రామచంద్రరావు

విశాలాంధ్ర,సీతానగరం:10వ తరగతి పరీక్షలలో విద్యార్థులు శతశాతం పలితాలుసాధించడానికి ఉపాద్యాయ సిబ్బంది కష్టపడి పనిచేయాలని, ఈనెల 18నుండి జరుగనున్న పరీక్షలకు విద్యార్థులను సిద్దంచేయాలని పాటశాల నోడల్ అధికారి,డ్వామా పిడి కెరామచంద్రరావుతెలిపారు.
జాయింట్ కలెక్టర్ శోభిత అదేశాలు మేరకు మంగళవారం నిడగల్లు ఉన్నత పాటశాలను సందర్శించి రెండు గంటల పాటు పదోతరగతి విద్యార్థులతో మాట్లాడారు.పరీక్షలకు విద్యార్దులకు ఉండే భయాన్ని పోగొట్టి ,ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలని సూచించారు. వెనుక బడిన విద్యార్థులపై ప్రత్యేకదృష్టి పెట్టి వారిలో కూడా మంచి ఫలితాలు వచ్చేలా కృషి చేయాలని సిబ్బందిని ఆదేశించారు.ఈవిద్యాసంవత్సరములో తమ పాఠశాలనుంచి పదవతరగతి పరీక్షలకు ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం విద్యార్డులు కలిపి 60మంది హాజరు కానున్నారని హెచ్ ఎం శివున్నాయుడు తెలిపారు.అందరూ ఉపాద్యాయ సిబ్బంది సహకారంతో మంచిఫలితాలు సాధించేందుకు కృషి చేస్తున్నట్టు తెలిపారు.ఈనెల 18నుండి జరగబోవు పరీక్షలను తమ విధ్యార్థులు సీతానగరం ఉన్నత పాఠశాలలోను, జోగమ్మపేట ప్రతిభా కళాశాలలో పరీక్షలు రాయడం జరుగుతుందన్నారు. జిల్లా అధికారుల అదేశాలు,వారంవారం నోడల్ అధికారి డ్వామా పిడి సూచనలు మేరకు మెరుగైన ఫలితాలు సాధించేందుకు కృషి చేస్తున్నట్టు చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img