విశాలాంధ్ర,సీతానగరం:మండలంలోని జోగమ్మపేట కేజీబీవీపాఠశాలను సాల్ట్ జిల్లా కో ఆర్డినేటర్ నాగరాజు, ఏఎంఓ శ్రీనివాసరావులు మంగళవారం సందర్శన చేసి పాఠశాలలో విధ్యాబ్యాసన పద్దతులు ద్వారా బోధనపద్ధతులు అవలంబిస్తున్న విధానం గూర్చి అడిగితెలుసుకున్నారు.ఈకార్యక్రమంలో ఫిజిక్స్ టీచర్ శైలజ, సిబ్బంది పాల్గొన్నారు. ఇదిలా ఉండగా ఈనెల 18నుండి జరుగనున్నపదోతరగతి పరీక్షలకు విద్యార్థులను సిద్దంచేయాలని పాటశాల నోడల్ అధికారి, ఎంఈఓ సూరిదేముడు తెలిపారు.జాయింట్ కలెక్టర్ శోభిత అదేశాలుమేరకు మంగళవారంనాడు జోగమ్మపేటలోని కేజీబీవి పాఠశాలను సందర్శించి రెండు గంటలపాటు ఉండి పదోతరగతి విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్దులకు ఉండే పరీక్షలభయాన్ని పోగొట్టి ,ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలని సూచించారు. వెనుక బడిన విద్యార్థులపై ప్రత్యేకదృష్టి పెట్టి వారిలో కూడా మంచి ఫలితాలు వచ్చేలా కృషి చేయాలని సిబ్బందినిఆదేశించారు.ఈవిద్యాసంవత్సరంలో తమ పాఠశాలనుంచి పదవతరగతి పరీక్షలకు విద్యార్డులు కలిపి 43మంది హాజరు కానున్నారని ప్రిన్సిపాల్ జొన్నాడ సంధ్య తెలిపారు. ఉపాద్యాయ సిబ్బంది సహకారంతో మంచిఫలితాలు సాధించేందుకు కృషి చేస్తున్నట్టు తెలిపారు.ఈనెల 18నుండి జరగబోవు పరీక్షలను తమ విధ్యార్థులు సీతానగరం ఉన్నత పాఠశాలలోను, జోగమ్మపేట ప్రతిభా కళాశాలలో పరీక్షలు రాయడం జరుగుతుందన్నారు. జిల్లా అధికారుల అదేశాలు,వారంవారం నోడల్ అధికారయిన ఎంఈఓ సూచనలుమేరకు మెరుగైన ఫలితాలు సాధించేందుకు కృషి చేస్తున్నట్టు చెప్పారు. ఆయనతో పాటు ఎంఈఓ సూరిదేముడు,ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు.