విశాలాంధ్ర ధర్మవరం:: 2024లో రాబోవు ఎన్నికలను సజావుగా విజయవంతంగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ కృషి చేస్తుందని డిఐజి అమ్మిరెడ్డి,ఎస్పీ మాధవరెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని బిఎస్ఎఫ్ జవాన్లకు ఎన్నికల్లో నిర్వహించాల్సిన విధివిధానాలపై తగిన సూచనలు సలహాలను తెలియజేశారు. ఎక్కడా ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా పోలీస్ శాఖ నిరంతరం అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ప్రతి ఓటరుకు సహాయ సహకారాలు అందించేలా పోలీసులు తమ వంతుగా కృషి చేయాలని తెలిపారు. వికలాంగులు, వృద్ధులకు కూడా ఓటు వేసేయుటలో తగిన సహాయం చేయాలని తెలిపారు. పోలింగ్ బూత్ కేంద్రాలలో ఏదైనా అనుమానాలు వచ్చిన సంబంధిత అధికారికి వెంటనే సమాచారాన్ని అందించాలని తెలిపారు. అనంతరం పట్టణములో డి ఐ జి, ఎస్ పి ఆధ్వర్యంలో పలుకూడి ల్లో బిఎస్ఎఫ్ జవాన్లతో పాటు పట్టణ పోలీస్ స్టేషన్లో సిఐలు, ఎస్సైలు, సిబ్బంది చేత మార్చ్ ఫాస్ట్ ను నిర్వహించారు.