Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

ఎంపి స్థానాన్ని తూర్పు కాపులకు కేటాయించాలి…

తూర్పు కాపు సామాజిక వేదిక డిమాండ్
విశాలాంధ్ర విజయనగరం టౌన్ : తూర్పు కాపులు అధికంగా ఉన్న విజయనగరం జిల్లాలో ఎంపీ స్థానాన్ని తూర్పు కాపులకు కేటాయించాలని తూర్పుకాపుల సామాజిక వేదిక అధ్యక్షుడు రొంగలి రామారావు, ఉపాధ్యక్షులు అంబల్ల అప్పలనాయుడు,మజ్జి అప్పారావు డిమాండ్ చేశారు. తూర్పు కాపులు సామాజిక వేదిక భవనంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి నేటి వరకు తూర్పు కాపులు అనగద్రొక్కబడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెనుకబడిన జాతికి చెందిన తూర్పుకాపులను ఎల్లప్పుడూ బడుగు జాతులగానే చూస్తున్నారే తప్ప పాలనాధికారాన్ని ఇచ్చేందుకు రాజకీయ పార్టీలు ముందుకు రావడంలేదని ఆందోళన వ్యక్తం చేశారు. పాలనాధికారాన్ని అగ్రజాతుల చేతుల్లో ఉంచుకొని బీసీ వర్గాలకు తీవ్రమైన అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. జిల్లాలో తూర్పు కాపులూప్ అధికంగా ఉన్నప్పటకి విజయనగరం ఎంపీ స్థానాన్ని కొన్ని పార్టీలు తూర్పు కాపు సామాజిక వర్గానికి కేటాయించకుండా అన్యాయం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ,ఎస్టీలకు కేటాయించిన నియోజకవర్గాలను మేము అడగడం లేదని, న్యాయబద్ధంగా తూర్పుకాపులు అధిక సంఖ్యలో ఉన్న నియోజకవర్గాలను తూర్పు కాపులు కేటాయించాలని కోరుతున్నామని విజ్ఞప్తి చేశారు. అయితే కొన్ని రాజకీయ పార్టీలు ఎప్పుడు అగ్ర కులాలకే ప్రాధాన్యతనిస్తూ తూర్పు కాపులకు మొండి చేయి చూపిస్తున్నాయని ఆరోపించారు.రాజకీయ పార్టీలు ప్రతి ఎన్నికలలో తూర్పు కాపులకు రాజకీయ ప్రాధాన్యత ఇవ్వకుండా అగ్రకులాలకు, ఇతర కులాల వారికి ప్రాధాన్యతనిస్తూ తూర్పు కాపులను బానిసలుగానే చూస్తున్నారని మండిపడ్డారు.ఇప్పటికైనా ఆయా పార్టీలు వారు తూర్పు కాపులు ప్రాధాన్యతను గుర్తించి ఎంపి స్థానాన్ని తూర్పుకాపులకు కేటాయించని పక్షంలో తూర్పు కాపుల ఆగ్రహానికి గురువ్వక తప్పదని హెచ్చరించారు. ఇంకా సమయం ఉన్నందున ఇప్పటికైనా ఆ పార్టీలు విజయనగరం ఎంపీ స్థానాన్ని తూర్పు కాపులలో ఆర్థిక బలం, అంగ బలం ఉన్న వారికి కేటాయించాలని, అలా జరగని పక్షంలో తదుపరి చర్యలకు తామంతా సిద్ధమవుతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో తూర్పు కాపు సామాజిక వేదిక వైస్ ప్రెసిడెంట్ పిన్నింటి చంద్రమౌళి, కోశాధికారి తట్టికాల వెంకటరమణ, న్యాయ సలహాదారులు చందక చిన్ని ప్రభాకర్ (చిన్ని) మంత్రి రమణమూర్తి, సంగం రెడ్డి సాయి, గంటి రెడ్డి మోహన్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img