ఏపీ నేషనల్ గ్రీన్ కోర్ రాష్ట్ర పర్యవేక్షణ అధికారిని జి.ప్రభ. ఎంఈఓ. గోపాల్ నాయక్
విశాలాంధ్ర – ధర్మవరం : ప్రతి విద్యార్థి పర్యావరణ పరిరక్షణ పై అవగాహన తప్పనిసరిగా చేసుకోవాలని, పర్యావరణాన్ని పరిరక్షణ అందరి బాధ్యత అని ఏపీ నేషనల్ గ్రీన్ కోర్ రాష్ట్ర పర్యవేక్షణ అధికారిని జి. ప్రభ, ఎంఈఓ గోపాల్ నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని యశోద కాన్సెప్ట్ స్కూల్లో పర్యావరణ పరిరక్షణ అవగాహన కార్యక్రమానికి వారు ముఖ్య అతిథిగా విచ్చేశారు. అనంతరం పర్యావరణ పరిరక్షణ పై పలు విషయాలను విద్యార్థులకు తెలియజేశారు.. అనంతరం వారు మాట్లాడుతూ పదవ తరగతి విద్యార్థులకు ఎకో క్లబ్ ఆవశ్యకతను, లైఫ్ స్కిల్స్ ను కాలుష్యమును నివారించేందుకు మొక్కలను పెంచాల్సిన ఆవశ్యకత ఉందని వారు తెలిపారు. ప్రతి విద్యార్థి పరిసర ప్రాంతాలలో మొక్కలను నాటి వాటిని జాగ్రత్తగా పెంచి పెద్ద చేసినట్లు అయితే భవిష్యత్ తరాలకు కాలుష్యం అనే కోరల నుండి ప్రజలను కాపాడవచ్చునని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ సత్య సాయి జిల్లా ఎన్జీసీ కోఆర్డినేటర్ నాగ అనిల్ కుమార్, క్లస్టర్ కోఆర్డినేటర్ శ్రీనివాసరావు, రాష్ట్ర ఎన్జిసి టీము, పాఠశాల డైరెక్టర్ పృథ్వీరాజ్, ప్రిన్సిపాల్ అను ప్ తదితరులు పాల్గొన్నారు..