ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ నజీర్.
విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణములో ఇటీవలే పోతుకుంట రోడ్డు లో నూతన ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని ప్రారంభించడం జరిగిందని, ఈ నూతన ఆసుపత్రిలో ఉదయం తొమ్మిది నుండి 12 గంటల వరకు ఓపి మాత్రమే చూడబడునని ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ నజీర్ తెలిపారు. పట్టణంలోని పాత ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భవతులకు మాత్రమే వైద్య చికిత్సలను అందించడం జరుగుతుందని వారు తెలిపారు. కావున పట్టణం, గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చే ప్రజలు ఓపి కొరకు నూతన ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి వైద్య చికిత్సలు అందించుకోవాలని తెలిపారు. రోగులందరూ కూడా వేసవికాలంలో వడదెబ్బ తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, త్రాగు నీరును అధికంగా సేవించాలని వారు తెలిపారు. కావున రోగులు పై విషయాన్ని గమనించి, సహకరించాలని తెలిపారు.