భాజపా జాతీయ కౌన్సిల్ సభ్యుడు అంబటి సతీష్
విశాలాంధ్ర ధర్మవరం;; వందే భారత్ రైలుతో ప్రయాణికులకు అన్ని వశలతో కూడిన సౌకర్యం ఉంటుందని భాజపా జాతీయ కౌన్సిల్ సభ్యుడు అంబటి సతీష్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవల ధర్మవరం కు వచ్చిన వందే భారత్ రైలుకు జెండా ఊపి ప్రారంభించడం జరిగిందని తెలిపారు. స్టేషన్ ఆవరణలోనే ఒక ఉత్పత్తి కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అత్యంత వేగంగా ప్రయాణించే విద్యుత్తు రైలును భారత ప్రభుత్వం తయారు చేయడం ఎంతో అభినందనీయమని తెలిపారు. గతంలో సుదూర ప్రాంతాల కు వెళ్లాలంటే అధిక సమయం పట్టేదని ప్రస్తుతం ఈ వందే భారత్ రైలుతో ప్రయాణం సుగుమం అయిందని తెలిపారు. ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలు కూడా సద్వినియోగం చేసుకోవాలని వారు తెలిపారు. వందే భారత్ రైలుకు కూడా ధర్మవరం ప్రజలు ఘనస్వాగతం పలకడం సంతోషించదగ్గ విషయమని తెలిపారు.