శ్రీ సత్య సాయి భజన మండలి
విశాలాంధ్ర ధర్మవరం:: రోగులకు సేవలు అందించుట దైవ సమానమని శ్రీ సత్యసాయి భజన మండలి నిర్వాహకులు తెలిపారు.. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రభుత్వ హాస్పిటల్ లో గల దాదాపు 200 మంది రోగులకు పాలు, బ్రెడ్లు, బిస్కెట్లను ఆసుపత్రి వైద్యులు, సిస్టర్లచే పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి దాతలుగా ఎక్కాల సత్యనారాయణ వారి కుటుంబ సభ్యులు వ్యవహరించడం జరిగింది అన్నారు. అనంతరం దాతలకు కృతజ్ఞతలు తెలియజేశారు. శ్రీ సత్య సాయి భజన మండలి నిర్వాహకులు మాట్లాడుతూ దాతల సహాయ సహకారములతోనే ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించుట మాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని తెలిపారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా శ్రీ సత్య సాయి భజన మండలి వారు రోగులకు వివిధ రూపాలలో సేవలు అందిస్తూ, వారి ఆహార విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ కనబరచడం సంతోషాదాయకంగా ఉందని, ఈ కార్యక్రమం రోగులకు వరంగా మారిందని తెలిపారు. అనంతరం ఆసుపత్రి వైద్యులు సిబ్బంది తరపున వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.