విశాలాంధ్ర. రాజాం : ట్రాన్స్ ఫార్మర్ నుంచే విద్యుత్ వాడకం విద్యుత్ అధికారులు దాడులు – జరీమాన
రాజాం పట్టణం లో ఈ నెల 17. తేదీ నుంచి జరగనున్న శ్రీ పోలిపల్లి పైడి తల్లి జాతర సందర్భంగా బొబ్బిలి రోడ్డులో ఆలయం సమీపంలో యాత్రికుల పిల్లలు, పెద్దలు కాలక్షేపం నిమిత్తం ఏర్పాటు చేసిన జెయింట్ వీల్ యంత్రం నిర్వాహకులు రాత్రి వేళ సమీపంలో ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫర్ నుంచి అక్రమంగా విద్యుత్ వినియోగిస్తున్న సంగతి తెలుసుకున్న అధికారులు దాడి చేసి అపరాధ రుసుము ( జరీమాన ) విధించారు. ఏఈ కుమార్ ఆధ్వర్యంలో దాడులు చేసి అక్రమంగా విద్యుత్ వినియోగించడం చట్టప్రకారం నేరమని హెచ్చరించారు…