విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని ఏడవ వార్డు శివానగర్ లో వెలసిన శ్రీ అభయ ఆంజనేయస్వామి వారి ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు ఆలయ కమిటీ, భక్తాదులు, ఏడవ వార్డ్ ఇంచార్జ్ గడ్డం రంగా, దాతల నడుమ అత్యంత వైభవంగా నిర్వహించుకున్నారు. తొలుత అర్చకులు స్వామివారికి వివిధ అభిషేకాలతో పాటు ప్రత్యేక అలంకరణ గావించారు. స్వామివారికి గావించిన అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. అనంతరం ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ ఈ ద్వితీయ వార్షికోత్సవం దాతలు, ఆలయ కమిటీ, భక్తాదుల ఆధ్వర్యంలో నిర్వహించడం పట్ల వారు అందరికీ కృతజ్ఞతలను తెలియజేశారు. తదుపరి భక్తాదులకు పెద్ద ఎత్తున భోజన పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో చెన్నారెడ్డి, రవీంద్రారెడ్డి ,గోపాల్ రెడ్డి, మిట్ట లక్ష్మీనారాయణ, రాజశేఖర్ రెడ్డి, ఏడవ వార్డ్ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.