సర్పంచ్ పుష్పలత
విశాలాంధ్ర – చింతపల్లి (అల్లూరి సీతారామరాజు జిల్లా):- చింతపల్లి మేజర్ పంచాయతీలో అశీలు వసూలు చేసేందుకు గాను పంచాయితీ కార్యాలయంలో ఈనెల 18న బహిరంగ వేలం పాట నిర్వహిస్తున్నామని స్థానిక సర్పంచ్ దురియా పుష్పలత అన్నారు. శుక్రవారం ఆమె మాట్లాడుతూ చింతపల్లి వారపు సంతలో ఆశీలు వసూలు చేసేందుకుగాను ఇదే పంచాయతీకి చెందిన స్థానికుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని, ఈ వేలంపాటలో పాల్గొనేవారు స్థానికులై ఉండడంతో పాటు, తప్పకుండా వారి ఆధార్ కార్డును వారితో పాటు తీసుకురావాలని, ధరావత్తు కింద ఐదు వేల రూపాయలు చెల్లించాల్సి ఉంటుందన్నారు. మరిన్ని వివరాలకై కార్యాలయ పని దినములలో పంచాయతీ కార్యాలయంను సందర్శించి పూర్తి వివరాలు తెలుసుకోవాలని ఆమె సూచించారు. పంచాయతీ నియమ నిబంధనలకనుగుణంగా వేలంపాట నిర్వహించడం జరుగుతుందని ఈ సందర్భంగా ఆమె తెలిపారు.