రాజాంలో ఘనంగా పొట్టి శ్రీరాములు జయంతి
కోవిడ్ 19 మరియు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రాజాం శాఖా ఆధ్వర్యంలో రాజాం రెడ్ క్రాస్ కార్యాలయంనందు పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు, పొట్టి శ్రీరాములు చేసిన 58 రోజుల నిరాహారదీక్ష కారణంగా ఆంద్రప్రదేశ్ అవతరణ జరిగింది, అలాగే దళితులకు ఆలయ ప్రవేశం కోసం ఎంతో కృషి చేసారు, ప్రజల మేలు కోసం ప్రాణ త్యాగం చేసిన మహాత్ముడు కాబట్టి వారిని ప్రతీ ఒక్కరూ గుర్తు పెట్టుకుని కృతజ్ఞతతో జీవించాలి అని ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు తెలియచేయడం జరిగింది. డి.ఎస్.పి ట్రైనీ ఎస్.మహేంద్ర, రాజాం టౌన్ సిఐ. దాడి మోహనరావు, రూరల్ సిఐ. శ్రీనివాసరావు, రాజాం రెడ్ క్రాస్ చైర్మన్ కొత్తా సాయి ప్రశాంత్ కుమార్, జాతీయ యువజన పురస్కార గ్రహీత పెంకి చైతన్య కుమార్, అంబికా కోటేశ్వరరావు, మోటివేషనల్ స్పీకర్ బూరాడ శివకృష్ణ, చీమకుర్తి ప్రసాద్, పొట్టా అప్పలరాజు, కొల్లూరు వెంకట తిరుమలేశ్వరరావు, వాకచర్ల పైడిరాజు, కొల్లి అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు…