జిల్లా కలెక్టర్ ఎం.గౌతమి
విశాలాంధ్ర -అనంతపురం వైద్యం : విజయవాడ, సిఎస్ క్యాంపు కార్యాలయం నుంచి శనివారం గ్రూప్- 1 పరీక్షలకు సంబంధించిన సూచనలు, మోడల్ కోడ్ ఆఫ్ కండెక్ట్ పై సూచనలు, పట్టా, డికెటి మరియు ప్రభుత్వ భూములకు సంబంధించి భూ సేకరణ & ఆర్&ఆర్ సమస్యలు, పీ&ఆర్డీ, ఎన్ఆర్ఈజిఎ – కరువు మండలాల్లో వేజ్ జనరేషన్, తాగునీరు, ఆరోగ్యం, వైద్యం & కుటుంబ సంక్షేమం, జననం & మరణం నమోదు చట్టంపై సూచనలు, తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.
అనంతపురం కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ ఎం.గౌతమి, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వేసవికాలం దృష్ట్యా జిల్లాలో తాగునీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బంది లేకుండా అవసరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. జిల్లాలోని గుంతకల్లు మండలంలోని మొలకలపెంట, వెంకటాంపల్లి, గురబాడు గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేస్తున్నామన్నారు. జిల్లాలోని పిఏబిఆర్ డ్యామ్ లో ప్రస్తుతం 1.50 టీఎంసీల నీరు నిల్వ ఉందని, ఇక్కడి నుంచి కళ్యాణదుర్గం, శ్రీ సత్యసాయి జిల్లాలోని హిందూపురం, మడకశిర, తదితర ప్రాంతాలకు తాగునీరు సరఫరా కావడం జరుగుతోందని తెలిపారు. వేసవిలో మూడు నెలలకు సంబంధించి ఎలాంటి ఇబ్బంది లేకుండా తాగునీరు సరఫరా అయ్యేలా చర్యలు చేపడతామన్నారు. సీపీడబ్ల్యూఎస్ మరియు ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ (ఓఅండ్ఎం)కు సంబంధించి జిల్లా పరిషత్ నుంచి 15వ ఆర్థిక సంఘం నిధులు ఉపయోగించుకునేలా పిఅండ్ఆర్డీ నుంచి అనుమతులు ఇవ్వాలని కోరారు. తాగునీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బంది ఎదురవకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా పరిషత్ సీఈవో వైఖోమ్ నిదియా దేవి, ఎస్డీసి ఆనంద్, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ జవహర్ కుమార్, డిఎంహెచ్ఓ డా.ఈబి.దేవి, ఆరోగ్యశ్రీ జిల్లా కోఆర్డినేటర్ డా.కిరణ్ కుమార్ రెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ జెడి ఉమామహేశ్వరమ్మ, జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ నాగరాజారావు, డ్వామా పిడి వేణుగోపాల్ రెడ్డి, డిఐఓ యుగంధర్, ఎఫ్డిపి నోడల్ అధికారి డా.సుజాత, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.