డిఐఈఓ రఘునాథరెడ్డి, ఆర్ఐవో సురేష్ బాబు
విశాలాంధ్ర ధర్మవరం:: జూనియర్ కళాశాలలో అధ్యాపకులకు పదోన్నతులు రావడం శుభదాయకమని డిఐఈఓ రఘునాథరెడ్డి, ఆర్ఐవో సురేష్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న 197 మంది అధ్యాపకులకు ప్రిన్సిపాల్ గా పదోన్నతులు ప్రభుత్వం కల్పించడం అభినందనీయమని తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వారు కృతజ్ఞతలను తెలియజేశారు. ఇందులో భాగంగా జోన్-Iv లో 54 మంది అధ్యాపకులకు ప్రిన్సిపాల్ గా పదోన్నతి లభించిందని, ఇందులో భాగంగా శ్రీ సత్యసాయి జిల్లాలో 12 ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు రెగ్యులర్ ప్రిన్సిపాల్ ను నియమించడం జరిగిందని తెలిపారు. అందులో భాగంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల కొత్త చెరువుకు జ్యోతిర్లత, పెనుకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలకు సుదర్శన్ లు ప్రిన్సిపాల్ గా పదవీ బాధ్యతలు స్వీకరించడం జరిగిందన్నారు. అలాగే మొత్తం 12 కళాశాలలో ఆయా ప్రిన్సిపాల్ పదవీ బాధ్యతలు స్వీకరించారని తెలిపారు. ఏళ్ల తరబడి ఆగిపోయిన ప్రిన్సిపాల్ పదోన్నతులను ప్రస్తుత ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకొని పదోన్నతను కల్పించడం అందరికీ ఆనందంగా ఉందని తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలు మరింత మెరుగు పడటానికి ఓ చక్కటి అవకాశం వచ్చిందని తెలిపారు.