విశాలాంధ్ర – శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా నుంచి జై భారత్ నేషనల్ పార్టీలో పలు సంఘాల ప్రతినిధులు చేరారు. ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు వి వి లక్ష్మి నారాయణ వారిని పార్టీలోకి ఆహ్వానించారు. సోమవారం విశాఖపట్నంలోని పార్టీ ప్రాంతీయ కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. పలాస నియోజకవర్గం నుంచి బద్రి సీతమ్మ యాదవ్, ఆమదాలవలస నియోజకవర్గం నుంచి బురిడి గౌరి శంకర్ తమ మద్దతుదారులతో పార్టీ ఉత్తరాంధ్ర కన్వీనర్ జై దేవ్ ఇంజరాపు, పార్టీ అధికార ప్రతినిధి, లీగల్ సెల్ కన్వీనర్, చౌదరి లక్ష్మణరావు, శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గం కన్వీనర్, ఇప్పిలి సీతారాజు సమక్షంలో వీరు పార్టీలో చేరారు. ఈ సందర్బంగా పార్టీ అధ్యక్షులు మాట్లాడుతూ వైఎస్సార్సీపీ, టీడీపీ ఇతర పార్టీల నుంచి జై భారత్ పార్టీలో చేరెందుకు చాలా మంది నేతలు సిద్ధంగా ఉన్నారని అన్నారు.