విశాలాంధ్ర తనకల్లు మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో నీటి సమస్య కారణంగా ఎంపీపీ వైవి కౌసల్య వైసీపీ నాగలక్ష్మి ఆధ్వర్యంలో కొత్త బోర్ వేయించారు కొత్త బోర్ లో నీరు పుష్కలంగా పడడంతో కాలనీవాసులు గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు నీటి సమస్య తీరడంతోపాటు స్మశానవాటికకు నీటి సౌకర్యం ఏర్పడుతుందని కాలనీవాసులు ఎంపీపీ కౌశల్యకు వైస్ ఎంపీపీ నాగలక్ష్మి కి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వార్డ్ మెంబర్ శివమ్మ వైసిపి నాయకులు శ్రీనివాసులు గొంది లక్ష్మన్న కొమ్మిది కుమార్ జింక మూర్తి రామానుజులు శంకర ముత్తన్న దేవేంద్ర ఇండ్ల చంద్ర తదితరులు పాల్గొన్నారు