విశాలాంధ్ర – చింతపల్లి(అల్లూరి సీతారామరాజు జిల్లా) :- అరకు పార్లమెంట్, అరకు, పాడేరు శాసనసభ స్థానాలకు వైకాపా అభ్యర్థులుగా చెట్టి తనుజారాణి, రేగం మచ్చలింగం, మత్స్యరాస విశ్వేశ్వరరాజు లను అధిష్టానం ప్రకటించడం హర్షనీయమని వైకాపా అరకు పార్లమెంట్ మాజీ ప్రధాన కార్యదర్శి జల్లీ సుధాకర్, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్ పర్సన్ జల్లి హాలియా రాణి దంపతులు అన్నారు. స్థానిక అంబేద్కర్ కాలనీలో వైకాపా శ్రేణులతో కలిసి వారు కేక్ కట్ చేసి ఒకరికొకరు కేక్ తినిపించుకుని సంతోషాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గడచిన ఐదేళ్లలో వైకాపా ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధిలోనే గాక సంక్షేమంలోనూ రాజకీయ పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను అందించి ప్రజాభిమానం చూరగొన్నదన్నారు. ఇటువంటి ప్రభుత్వాన్ని మరో మారు ఆశీర్వదించేందుకు ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉన్నారన్నారు.మునుపెన్నడూ లేని విధంగా 175 స్థానాలకు 175 స్థానాలు కైవసం చేసుకోవాలనే నినాదంతో వైకాపా175 స్థానాలను ఒకేసారి ప్రకటించిన దమ్మున్న పార్టీ వైకాపా అన్నారు. అరకు పార్లమెంట్ తో పాటు పాడేరు, అరకు శాసనసభ స్థానాలలో వైకాపా అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించి జగనన్నకు బహుమతిగా అందజేసేందుకు పార్టీ శ్రేణులు అంతా సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.