విశాలాంధ్ర – ధర్మవరం : ఈనెల 16, 17 వ తేదీలలో తిరుపతి నగరంలో జరిగిన విశ్వహిందూ పరిషత్ దక్షిణాంధ్ర ప్రాంత సమావేశంలో భాగంగా శ్రీ పులిచెర్ల వేణుగోపాల్ ను శ్రీ సత్య సాయి జిల్లా అధ్యక్షులుగా వారు అందించిన సేవలను పరిగణలోనికి తీసుకొని వారిని అనంతపురం పుట్టపర్తి ఉమ్మడి జిల్లాకు విభాగ కార్యదర్శిగా ఎంపిక చేశారు, అదేవిధంగా ధర్మవరం పట్టణ అధ్యక్షులుగా సేవలు అందించిన పోలిశెట్టి వెంగముని ను శ్రీ సత్యసాయి జిల్లా ఉపాధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా వేణుగోపాల్ మాట్లాడుతూ విశ్వహిందూ పరిషత్ సిద్ధాంతాలను సనాతన ధర్మాన్ని సమాజానికి అందించడంలో శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా విహెచ్పి ధర్మవరం కార్యకర్తలు అందరూ హర్షం వ్యక్తం చేశారు. అనంతరం ఇరువురికి శుభాకాంక్షలు తెలియజేశారు.