విశాలాంధ్ర-విజయనగరం టౌన్ : జిల్లా ఎస్పీ ఎం.దీపిక, ఐపిఎస్ ఆదేశాలతో శుక్రవారం టూ టౌన్ పోలీసు స్టేషను పరిధిలోని పూల్ బాగ్, ఖాదర్ నగర్, బాబామెట్ట, దాసన్నపేట ప్రాంతాల్లో టూ టౌన్ ఇన్స్పెక్టర్ కె.రామారావు , ఎస్ఐ శ్రీ రాజేష్ ఆధ్వర్యంలో సివిల్ మరియు కేంద్ర బలగాలు సంయుక్తంగా ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. మే 13న రాష్ట్రంలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించుటకు చేపట్టిన ముందస్తు చర్యల్లో భాగంగా పట్టణంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించి, శాంతియుతంగా ఎన్నికల నిర్వహణకు ప్రజలందరూ సహకరించాలని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తుల సమాచారం అందించాలని కోరారు.