విశాలాంధ్ర-రాజాం : విశాఖ వేదికగా నిన్న చెన్నైతో మ్యాచులో గెలిచిన దిల్లీ టీమ్ సోమవారం రాజాంలో జీఎంఆర్ ఐటీ క్యాంపస్ లో సందడి చేశారు. మిగతా క్రికెటర్లతో పాటు అక్కడ మ్యూజిక్కు అనుగుణంగా మిచెల్ మార్ష్ స్టెప్పులు వేసి విద్యార్థులను ఉత్సాహపరిచారు. క్రికెటర్లను చూడ్డానికి విద్యార్థులు ఎగబడ్డారు. వారితో ఫొటోలు తీసుకోవడానికి ఆరాటపడ్డారు. క్రికెటర్లను చూసిన ఆనందంతో క్యాంపస్ అంతా కరతాళ ధ్వనులతో క్యాంపస్ ఆవరణ అంతా సందడిగా కనిపించింది…