తెదేపా మండల ఉపాధ్యక్షుడు లక్ష్మయ్య
విశాలాంధ్ర – చింతపల్లి (అల్లూరి సీతారామరాజు జిల్లా):- పాడేరు నియోజకవర్గ తెదేపా అభ్యర్థి మార్పు జరుగుతున్నట్లయితే చింతపల్లి మాజీ శాసనసభ్యుడు ముట్టడం వీర వెంకట సత్యనారాయణ కుమారుడు గిరిజన సహకార సంస్థ మాజీ చైర్మన్ ఎం వి వి ప్రసాద్ కు అవకాశం కల్పించాలని ఆ పార్టీ చింతపల్లి మండల ఉపాధ్యక్షుడు కిముడు లక్ష్మయ్య, మాజీ మండలాధ్యక్షుడు బేరా సత్యనారాయణ లు అన్నారు. మండలంలోని పెద్ద బరడ పంచాయతీ చినరాజుపాకల గ్రామంలో సోమవారం ఆ పార్టీ శ్రేణులతో సమావేశమైన వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ లో చింతపల్లి శాసనసభ్యులుగా రెండుసార్లు విజయం సాధించిన ఎం వి వి సత్యనారాయణ మరణానంతరం ఆయన కుమారుడు ఎం వి వి ప్రసాద్ పార్టీలో చురుకైన యువ నాయకునిగా ఎదిగారన్నారు. పార్టీ బలోపేతానికి ఆయన చేసిన కృషి ఎనలేనిదన్నారు. ప్రస్తుతం తెదేపా పాడేరు నియోజకవర్గం అభ్యర్థిగా వేరే వ్యక్తిని ప్రకటించిన విషయం తెలిసిందే అన్నారు. ఒకవేళ అనివార్య కారణాల వలన అభ్యర్థి విషయంలో మార్పు జరిగేటట్లయితే ఎంవివి ప్రసాద్ కు అవకాశం కల్పించినట్లయితే అత్యధిక మెజార్టీతో గెలిపించే బాధ్యత తాము తీసుకుంటామని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెదేపా, జనసేన నాయకులు పొత్తూరు రామ్మూర్తి, బడిమెల బంగారయ్య, రాజన్, వెంకటరమణ, కార్యకర్తలు, గ్రామస్తులు, ఎం వి వ అభిమానులు పాల్గొన్నారు.