విశాలాంధ్ర – విజయనగరం అర్బన్ : తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు పూసపాటి అశోక్ గజపతి రాజు, నియోజకవర్గ ఇంచార్జ్, తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ విజయనగరం శాసనసభ ఉమ్మడి అభ్యర్థి పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతి రాజు సూచన మేరకు విజయనగరం పట్టణం క్లస్టర్ -8 తోటపాలెం లో “జయహో బిసి” కార్యక్రమం బీసీ కమిటీల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో వైకాపా ప్రభుత్వంలో బీసీలకు జరుగుతున్న అన్యాయాలు, వారిపై జరుగుతున్న దాడులు వంటి విషయాలపై చర్చించి తెలుగుదేశం పార్టీ – జనసేన – బీజేపీ పార్టీలకు మద్దతుగా బిసిలందరూ నిలిచి సైకిల్ గుర్తుపై ఓటు వేసి విజయనగరం శాసనసభ అభ్యర్థి పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతి రాజుని గెలిపించాలని నాయకులందరూ కోరారు
ఈ కార్యక్రమంలో కంది మురళీనాయుడు, కోండ్రు శ్రీనివాసరావు, మాడిమి దేవేంద్రనాధ్, మనోహర్, కండువా ప్రకాష్, పేరిశెట్టి గోపి, కరణం సూర్యతేజ, చినబాబు, బోను కుమార్, గండ్రేటిసత్యనారాయణ ,బీసీకులవృత్తులవారు మరియు బీసీ వర్గాల ప్రజలు, తెలుగుదేశం, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తదితరులు పాల్గొన్నారు.