విశాలాంధ్ర ధర్మవరం : రెవెన్యూ డివిజన్ పరిధిలోని చెన్నై కొత్తపల్లి మండలం ఒంటి కొండ గ్రామంలో ఈ నెల ఏడవ తేదీ నుండి పదవ తేదీ వరకు శ్రీ ఒంటికొండ అక్కమ్మ గార్ల బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు ధర్మకర్త శ్రీరాములు, పూజారి లక్ష్మి నారాయణ, అఖిల్ కృష్ణ తెలిపారు. వారు మాట్లాడుతూ ఈనెల 7న ఆదివారం ఎలవ, ఎనిమిదవ తేదీన జల్దీ, 9వ తేదీన ఉగాది పండుగ, పదవ తేదీన పరిష అండ్ కుంకాలు అనే కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఆదివారం ఎలవ అనే మొట్టమొదటి కార్యక్రమాన్ని కమిటీ భక్తాదులు దాతల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. దాదాపు అన్నదాన కార్యక్రమానికి వందల సంఖ్యలో భక్తాదులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భక్తాదులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.