డిప్యూటీ డి ఎం హెచ్ ఓ సెల్వియా సాల్మన్
విశాలాంధ్ర-ధర్మవరం : ప్రజలకు వైద్య సేవలు సక్రమంగా అందించేలా చర్యలు చేపట్టాలని డిప్యూటీ డిఎంహెచ్వో సెల్వియా సల్మాన్ తెలిపారు. ఈ సందర్భంగా మండల పరిధిలోని దర్శనమల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని రేగాటిపల్లి గ్రామంలో జరుగుతున్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని వారు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ కార్యక్రమం ఎలా జరుగుతోంది, ప్రజలకు అందాల్సిన వైద్య సేవలపై వారు నేరుగా ప్రజల్ని అడిగి తెలుసుకున్నారు. తదుపరి వైద్య సిబ్బందికి తగు సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఎండాకాలం ఉన్నందున వడదెబ్బకు గురికాకుండా ప్రజలందరూ తగిన జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. అదేవిధంగా వైద్యులు కూడా గ్రామీణ ప్రాంతాలలో వడదెబ్బ శోకకుండా తీసుకోవలసిన జాగ్రత్తలపై కూడా అవగాహన సదస్సులను నిర్వహించాలని వారు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ పుష్పలత, లెప్రసి అధికారి తిప్పయ్య, చిన్నపిల్లల వైద్య నిపుణులు వెంకటేశ్వర్లు, ఈఎన్టి స్పెషలిస్ట్ నివేదిత, ఆప్తలమిక్ ఆఫీసర్ ఉరుకుందప్ప, సూపర్వైజర్లు రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.