విశాలాంధ్ర- ధర్మవరం : మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ ను ధర్మవరం లోని పలువురు మైనారిటీ సోదరులు రంజాన్ పురస్కరించుకొని అనంతపురంలోని వారి స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిశారు. తదుపరి మైనారిటీ సోదరులు రంజాన్ సందర్భంగా గోనుగుంట్ల సూర్యనారాయణ శాలువాగప్పి, స్వీట్లు పంపిణీ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. తదుపరి ధర్మవరం పరిస్థితులను వారు వివరించారు.