శ్రీ వరసిద్ధి వినాయక ఆలయ కమిటీ
విశాలాంధ్ర ధర్మవరం;;; పట్టణంలోని యాదవ వీధిలో వెలసిన శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో ఆలయ జీర్ణోదారణ కార్యక్రమంలో భాగంగా స్వామి వారి చర కలశాన్ని ఉద్వాసనం చేసి గాయత్రి దేవాలయంలో పునః ప్రతిష్ట చేయడం జరిగిందని ఆలయ అధ్యక్షులు మాల గుండ్ల మల్లికార్జున, కార్యదర్శి రమణ రెడ్డి, సహకార దర్శి కోటి వెంకటేష్, అర్చకులు రాజశేఖర్ శర్మ తెలిపారు. అర్చకులు వేదమంత్రాలు నడుమ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన పిదప స్వామివారి చర కలశాన్ని మంగళ వాయిద్యాల నడుమ వేదమంత్రాల నడుమ ప్రక్కనే గల గాయత్రి దేవాలయంలో పునః ప్రతిష్టడం చేయడం జరిగిందని తెలిపారు. తదుపరి ఈ ఆలయ జీర్ణోదారణ నిర్మాణ కార్యక్రమానికి డాక్టర్ బెస్త లక్ష్మి సుబ్రహ్మణ్యం 25 వేల రూపాయలు, కంభం సునీత, కంభం పెద్దిరెడ్డి కిరాణా షాపు వారు 25వేల 16 రూపాయలు విరాళంగా అందజేశారు. అనంతరం అర్చకులు కమిటీ ఆధ్వర్యంలో వీరి పేరిటన ప్రత్యేక పూజలు నిర్వహించి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి భక్తాదులు కూడా అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ వేడుకల్లో భక్తాదులతో పాటు సభ్యులు మైలవరం సాయినాథ ప్రసాద్, కోశాధికారి పిన్ను సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.