Tuesday, May 21, 2024
Tuesday, May 21, 2024

తాగునీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు -ఎంపీడీఓ గీతావాణి

విశాలాంధ్ర-రాప్తాడు : మండలంలోని 26 గ్రామాల్లో వేసవిలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపడతామని ఎంపీడీఓ గీతావాణి తెలిపారు. రాప్తాడు ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం మండల సర్వసభ్య సమావేశాన్ని ఎంపీపీ చిట్రెడ్డి జయలక్ష్మి, జడ్పిటిసి పసుపుల హేమావతితో కలిసి నిర్వహించారు. మండలంలో ఎక్కడైనా తాగునీటి సమస్య నెలకొన్నట్లయితే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తాగునీటి ట్యాంకులు శుభ్రం చేయించాలన్నారు. ఎక్కడైనా బోర్లు, కుళాయిలు మరమ్మత్తులు గురైతే తక్షణమే చేయించాలని ఆర్డబ్ల్యూఎస్ వెంకటేష్, పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీలు, సర్పంచులు ఎంపీటీసీలు ఇతర మండల అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img