Sunday, May 19, 2024
Sunday, May 19, 2024

ఆలస్యంగా వెలుగు చూసిన మహిళ మృతదేహం

చెరపల్లి అడవిలో మహిళా మృతదేహం లభ్యం

అడ్డపిక్కల కోసం వెళ్లి మృత్యువాత పడిన వృద్ధురాలు రాజులమ్మ

విశాలాంధ్ర – చింతపల్లి (అల్లూరి సీతారామరాజు జిల్లా):- అడ్డపిక్కల కోసం అడవికి వెళ్లి గడచిన ఐదు రోజులుగా ఇంటికి చేరని వృద్ధురాలు వంజరి రాజులమ్మ ఎట్టకేలకు మృతదేహమై కనిపించింది. ఆలస్యంగా అందిన సమాచారం మేరకు అల్లూరి జిల్లా జీకే వీధి మండలం వనబలింగి గ్రామానికి చెందిన వంజరి రాజులమ్మ గత ఐదు రోజుల క్రితం అడ్డపిక్కలు ఏరుకొను నిమిత్తం ఇంటి నుండి బయలు దేరి అడవికి వెళ్ళిందని, నాటినుండి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆమె కోసం గాలిస్తున్న నేపథ్యంలో సోమవారం చెరపల్లి అటవీ ప్రాంతంలో ఆమె మృతదేహం లభ్యం అయింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img