Saturday, May 18, 2024
Saturday, May 18, 2024

నియోజకవర్గ సమస్యలు తప్పక పరిష్కరిస్తాం…

బిజెపి అభ్యర్థి సత్య కుమార్ యాదవ్ సతీమణి త్రివేణి.

విశాలాంధ్ర ధర్మవరం;; ధర్మవరం నియోజకవర్గ సమస్యలను తప్పక పరిష్కరిస్తామని బిజెపి ఉమ్మడి అభ్యర్థి సత్య కుమార్ యాదవ్ సతీమణి త్రివేణి తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని ఏడవ ఎనిమిదవ వార్డులలో ఎన్నికల ప్రచారాన్ని విస్తృతంగా నిర్వహించారు. ఇంటింటా తిరుగుతూ మేనిఫెస్టో కరపత్రాలను పంపిణీ చేశారు. కమలము గుర్తుకే ఓటు వేసి, అత్యధిక మెజార్టీతో సత్య కుమార్ యాదవ్ను గెలిపించాలని వారు ఓటర్లను అభ్యర్థించారు. కేంద్రంలో ప్రధాన మంత్రి మోడీ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే రాష్ట్రం బాగుపడుతుందని రాష్ట్ర ప్రజల సమస్యలు, నిరుద్యోగ సమస్యలు, తప్పక తీరుతాయని తెలిపారు. మహిళలు కూడా అనేక పథకాలను మ్యానిఫెస్టోలో ఉంచడం జరిగిందని, వాటిని కూడా అమలుపరిచి మహిళల అభ్యున్నతికి పాటుపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి, జనసేన, టిడిపి నాయకులు ,కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img