Sunday, May 5, 2024
Sunday, May 5, 2024

జేఈఈ మెయిన్స్ లో జాతీయస్థాయిలో ఉత్తమ ప్రతిభ చాటిన నాగార్జున స్కూల్ విద్యార్థి

విశాలాంధ్ర, ఎన్ పి కుంట: జాతీయ పరీక్షల విభాగం (ఎన్డీఏ) నిన్న విడుదల చేసిన జేఈఈ మెయిన్స్ తుది ఫలితాలలో నంబులపూలకుంట మండలం అలుగుంటవారిపల్లి ప్రాథమిక పాఠశాలలో సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న శ్రీనివాసులు రెడ్డి, సాయి ప్రసన్న దంపతుల కుమారుడు సాయి దివ్య తేజ రెడ్డి జాతీయస్థాయిలో 15వ ర్యాంకు, రాష్ట్ర స్థాయిలో 8వ ర్యాంకు సాధించారు. పదవ తరగతిలో మండల కేంద్రంలోని స్థానిక నాగార్జున ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు చదివి 580 మార్కులతో ఉత్తీర్ణత సాధించి మండల టాపరుగా నిలిచారు. ఈ సందర్భంగా మండల ఎంఈఓ లు గోపాల్ నాయక్, సుబ్బిరెడ్డి, ఎస్ టీ యు జిల్లా అధ్యక్షులు హరిప్రసాద్ రెడ్డి, మండల ఉపాధ్యాయులు అభినందనలు, శుభా కాంక్షలు తెలుపుతూ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. జాతీయస్థాయిలో ప్రతిభ చాటిన నాగార్జున స్కూల్ విద్యార్థికి నాగార్జున ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ యాజమాన్యం ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img