విశాలాంధ్ర – జె ఎన్ టి యుఏ: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం చేపడుతున్న ఏపీ ఐ సెట్ 2024 పరీక్ష కు 48828 దరఖాస్తులు వచ్చాయని ఉపకులపతి ఆచార్య కే హుస్సేన్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం ఎస్కేయూలో ఏపీ ఐసెట్ పరీక్ష పై పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. అనంతరం వీసీ మాట్లాడుతూ .. పరీక్ష మొత్తం 49 కేంద్రాల్లో పరీక్ష చేపడుతున్నట్లు తెలిపారు. పరీక్ష సమయానికి అరగంట ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్ ఆచార్య పి. మురళి కృష్ణ , వైస్ కన్వీనర్ ఆచార్య నరసింహన్ , మెంబెర్స్ ఆచార్య పి. వెంకట రమణ , ఆచార్య టి. భాస్కర్ రెడ్డి , ఆచార్య డి. ప్రభాకర్ , సబ్జెక్టు ఎక్సపర్ట్ ఆచార్య ఏవి రమణ , ఆచార్య ఏ . మల్లికార్జున రెడ్డి (ఫార్మర్ రెక్టర్) , యూనివర్సిటీ పి ఆర్ ఓ ఆచార్య కే. రామ గోపాల్ పాల్గొన్నారు.