ఎన్నికల కోడ్ ఉల్లంఘించడంపై ఈసీ కొరడా
విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని ఎన్టీఆర్ సర్కిల్లో ఈ నెల 11వ తేదీన ఎన్నికల ప్రచారంలో సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి బిజెపి అభ్యర్థి సత్తి కుమార్ యాదవ్ పై బూతు పురాణముతో దుర్భాషలాడారు. దీంతో ఎన్నికల కమిషన్ కేసును నమోదు చేయడం జరిగింది. సత్య కుమార్ యాదవ్ కులం విషయంపై ఆయన వ్యక్తిత్వాన్ని తీర్చేపరిచేలా వాక్యాలు చేయడంతో పాటు పత్రికల్లో రాయలేని భాషతో బూతులు తిట్టారు. ఎన్నికల నియమావళికి విరుద్ధంగా ప్రవర్తించినందుకు ధర్మవరం మున్సిపల్ కమిషనర్ రామ్ కుమార్ ఫిర్యాదు మేరకు ఎన్నికల కమిషన్ ఎమ్మెల్యే కేతిరెడ్డి పై కేసు నమోదు చేయడం జరిగింది. ప్రశాంతతను కోరుకునే ధర్మవరం వాసుల ఎన్నికల కమిషన్ తీసుకున్న చర్యలపై హర్షం వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. ఎంతటి వ్యక్తులైన చట్టం ముందు సమానమే అన్నది నిరూపిత కావడం సంతోషదాయకమని పలువురు అభిప్రాయపడుతున్నారు.