విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : మంత్రాలయం ఎమ్మెల్యేగా బాలనాగిరెడ్డి అత్యధిక మెజార్టీతో విజయం సాధిస్తారని వైసీపీ బీసీ సెల్ జిల్లా నాయకులు జాము మూకయ్య ధీమా వ్యక్తం చేశారు. సోమవారం పెద్దకడబూరు గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రజా సమస్యలపై నిరంతరం శ్రమించడం ఎమ్మెల్యే కుటుంబానికే దక్కుతుందని కొనియాడారు. కుల రాజకీయాలు చేసే నాయకులను ప్రజలు నమ్మే స్థితిలో లేరని టీడీపీ నాయకులకు చురకలు అంటించారు. టిడిపి నాయకుల గుండెల్లో ఓటమి భయం మొదలైందని, రాబోయేది వైసీపీ ప్రభుత్వమని, ఎమ్మెల్యేగా బాలనాగిరెడ్డి నాల్గోసారి విజయం సాధించి మంత్రి పదవి చేపట్టడం ఖాయమన్నారు.అంతేకాకుండా నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా బాలనాగిరెడ్డి ప్రజల గుండెల్లో నిలిచి పోయారని, అది ఎప్పటికీ చెరిగిపోదన్నారు. ప్రజల వద్దకు పాలన జగనన్నతోనే సాధ్యమని ఆయన వెల్లడించారు.