గ్రామీణ నీటిపారుదల శాఖ ఏఈ స్వర్ణలత
పగిలిన ట్యాంకుతో తలెత్తిన నీటి సమస్య కథనానికి స్పందన
విశాలాంధ్ర – చింతపల్లి (అల్లూరి సీతారామరాజు జిల్లా) :- మండలంలోని చెదలపాడు గ్రామంలో నీటి సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టినట్లు గ్రామీణ నీటిపారుదల శాఖ ఏఈఈ గడుతూరి స్వర్ణలత అన్నారు. ఈ మధ్యకాలంలో కాచిన విపరీతమైన ఎండల కారణంగా మండలంలోని చెదలపాడు గ్రామంలో సోలార్ ద్వారా గ్రామానికి నీటి సరఫరా చేస్తున్న ఐదువేల లీటర్ల వాటర్ ట్యాంక్ పెద్ద శబ్దంతో పగిలి నీటి సమస్య తలెత్తింది అంటూ విశాలాంధ్ర దినపత్రికలో వచ్చిన కథనానికి స్పందించిన గ్రామీణ నీటిపారుదల శాఖ అధికారి ఆ సమస్య పరిష్కారానికి కృషి చేశారు. ట్యాంక్ పగలడం వలన గ్రామంలో తలెత్తిన నీటి సమస్య పరిష్కారానికి సంబంధిత అధికారులు స్పందించి గ్రామంలో నూతనంగా త్రాగు నీటి ట్యాంకు ఏర్పాటు చేశారు. ట్యాంక్ ఏర్పాటు చేయడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.