విజయనగరం జిల్లా – రాజాం : విజయనగరం జిల్లా రాజాం శ్రీ సత్యసాయి మందిరం (శివం మందిరం) సేవా సమితి బాబానగర్ వారి ఆధ్వర్యంలో రాజాం పాలకొండ రహదారిలో బాబానగర్ జంక్షన్ వద్ద ప్రతిరోజు మజ్జిగ పంపిణీ సుమారు 3000 మంది వరకు జరుగుతున్నది. ఈ సేవా కార్యక్రమంలో శివం మందిరం శ్రీ సత్యసాయిబాబా సేవా సమితి సభ్యులు ప్రతి రోజు పాల్గొనడం జరుగుతున్నది. నిర్వాహకులు మాట్లాడుతూ ఈ సేవా కార్యక్రమం ప్రతి ఏడాది వేసవికాలంలో ప్రతిరోజు నిర్వహించబడుచున్నదని తెలియజేశారు.