Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

వైఫల్యమే: సీఈఓ మీనా

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : ఈవీఎం ధ్వంసం ఘటనను సిగ్గుమాలిన చర్యగా కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొందని, స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణలో వైఫల్యంగా ఈసీ దీనిని గుర్తించిందని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి ముకేష్‌కుమార్‌ మీనా తెలిపారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ ఇలాంటి ఘటనలపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు వెల్లడిరచారు. పోలింగ్‌ రోజున ఏపీలో మొత్తం 9 చోట్ల ఈవీఎంలు ధ్వంసమయ్యాయని, మాచర్లలో 7 ఘటనలు చోటుచేసుకున్నట్లు తెలిపారు. ఈవీఎంలను ధ్వంసం చేసిన ఘటనలన్నీ వెబ్‌కాస్టింగ్‌ ద్వారా పరిశీలించామన్నారు. అయితే ఈవీఎం ధ్వంసం చేసినా డేటా భద్రంగా ఉందని, దీంతో కొత్త ఈవీఎంలతో పోలింగ్‌ కొనసాగించామన్నారు. ఈ ఘటనలకు సంబంధించి సిట్‌కు పోలీసులు అన్ని వివరాలు అందించారని, పాల్వాయి గేటు పోలింగ్‌ కేంద్రంలో ఘటనకు సంబంధించి మొదటి నిందితుడిగా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పేర్కొంటూ కేసు నమోదు చేశారన్నారు. ఆయనపై ఈనెల 20న రెంటచింతల కోర్టులో మెమో దాఖలు చేశారని, మొత్తం 10 సెక్షన్ల కింద పిన్నెల్లిపై కేసులు పెట్టారన్నారు. దీనిపై ఆయనకు ఏడేళ్ల వరకూ శిక్ష పడే అవకాశం ఉందని మీనా చెప్పారు. ఎమ్మెల్యే పిన్నెల్లిని అరెస్టు చేయడానికి పోలీసు బృందాలు గాలిస్తున్నాయన్నారు.మిగతా చోట్ల కూడా ఈవీఎంలు ధ్వంసం చేసిన ఘటనలపై కేసులు పెట్టి దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఎవర్నీ వదిలే ప్రసక్తే లేదన్నారు. ఈ ఘటన నమోదు అయిన సమయంలో ఈసీ ఆదేశాలతో బదిలీలు జరిగాయని, ఈవీఎం ధ్వంసం ఘటనల్లో తామేమీ దాచిపెట్టలేదన్నారు. ఘటన జరిగిన మరుసటి రోజే ఆధారాలను పోలీసులకు అప్పగించామని ఒక ప్రశ్నకు సమాధానంగా సీఈవో చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img