విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో ఈనెల 26వ తేదీ ఆదివారం ఉదయం 10 నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఉచిత కంటి చికిత్స శిబిరమును నిర్వహిస్తున్నట్లు లయన్స్ క్లబ్ వ్యవస్థాపకులు వెంకటస్వామి, లయన్స్ క్లబ్ అధ్యక్షులు గూడూరు మోహన్ దాస్, కోశాధికారి వేణుగోపాలచార్యులు, కార్యదర్శి రాజగోపాల్ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వన్టౌన్ సిఐ సుబ్రహ్మణ్యం, ముఖ్య వక్తగా పళ్లెం వేణుగోపాల్ చార్టర్ మెంబర్, క్యాంపు దాతగా తీపి శేషులు గోశే రామలక్ష్మమ్మ జ్ఞాపకార్థం వీరి కుమారుడు గోశే రాధాకృష్ణ అండ్ సన్స్ వ్యవహరించడం జరుగుతుందని తెలిపారు. ఉచిత ఆపరేషన్ తో పాటు ఉచితంగా అద్దాలు కూడా పంపిణీ చేయబడునని తెలిపారు. కావున ఈ అవకాశాన్ని పట్టణ,గ్రామీణ పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వారు తెలిపారు.