తెదేపా సీనియర్ నాయకుడు బేతాళుడు
విశాలాంధ్ర – చింతపల్లి(అల్లూరి సీతారామరాజు జిల్లా) :- పాడేరు నియోజకవర్గంలో కూటమి తెదేపా అభ్యర్థి గిడ్డి ఈశ్వరి విజయం సాధించడం ఖాయమని ఆ పార్టీ సీనియర్ నాయకుడు పెదిరెడ్ల బేతాళుడు అన్నారు. స్థానిక చేయూత వారియర్స్ ట్రస్ట్ చైర్మన్ దూనబోయిన రమణ, ట్రస్టు సభ్యులతో కలిసి గురువారం పాడేరులో కూటమి తెదేపా అభ్యర్థి గిడ్డి ఈశ్వరిని ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సార్వత్రిక ఎన్నికలలో నిర్వహించిన కార్యక్రమాలపై, జూన్ 4న విలువడే ఎన్నికల ఫలితాలపై ఆమెతో చర్చించారు. పాడేరు నియోజకవర్గం లో కూటమిదే విజయమని, అదే క్రమంలో రాష్ట్రంలోనూ రాబోయేది కూటమి ప్రభుత్వమేనని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ బీసీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పోలుపర్తి గోవింద్ మాస్టార్ తదితరులు పాల్గొన్నారు.