విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని రోటరీ క్లబ్ వారు వివిధ సేవలను పేద ప్రజలకు అందించడంలో ప్రజల యొక్క మన్ననలు పొందుతున్నారు. ఈ సందర్భంగా అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా రోటరీ క్లబ్ ద్వారా పేద ప్రజలకు ఉచిత కంటి ఆపరేషన్లతో పాటు ఉచితంగా అద్దాలను కూడా ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. అంతేకాకుండా వివిధ సేవా కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నామని తెలిపారు. పేదరికాన్ని రూపు మాపదంలో రోటరీ క్లబ్ విశేష కృషి చేస్తానని తెలిపారు. రోటరీ క్లబ్ స్థాపించినప్పటి నుండి ఇప్పటివరకు దాదాపు 60,000 మందికి కంటి వెలుగును ప్రసాదించడంతోపాటు ఉచితంగా కంటి అద్దాలను కూడా పంపిణీ చేశామని తెలిపారు. ప్రతి శిబిరము దాతల సహాయ సహకారంతో నడపడం జరుగుతోందని తెలిపారు. అదేవిధంగా నేత్రదానం మరొకరికి కంటి వెలుగులు ప్రసాదిస్తుందని, మృతి చెందిన మూడు గంటల లోపు సమాచారాన్ని మా రోటరీ క్లబ్ కు అందజేస్తే, నేత్రాలను స్వీకరించడం జరుగుతుందని తెలిపారు. అంతేకాకుండా పేద ప్రజలలో ఎవరైనా హఠాత్తుగా మృతి చెందితే అందుబాటులో ఉండేందుకు ఫ్రీజర్ ను కూడా అతి తక్కువ ఖర్చుతో పంపిణీ చేస్తున్నామని తెలిపారు. పట్టణంలోనే కాకుండా ఇతర జిల్లాలలోని మండలాలను కూడా మా సేవలను కొనసాగిస్తున్నామని తెలిపారు. ఇటువంటి అవకాశాన్ని పేదలందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.