విశాలాంధ్ర ధర్మవరం;; పాఠశాలలు రీఓపెన్ తేదీలలో పుస్తకాలను పంపిణీ చేస్తామని ఎంఈఓ గోపాల్ నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2024-25 విద్యా సంవత్సరం లో ఈనెల 12వ తేదీన పాఠశాలలు పునః ప్రారంభమవుతాయని, ఈ సమయంలోనే ఒకటవ తరగతి నుంచి ఏడవ తరగతి వరకు వచ్చిన 21,000 పుస్తకాలను ఆయా పాఠశాలలకు పంపించడం జరుగుతుందని తెలిపారు. సోమవారము నాడు ఎనిమిదవ, తొమ్మిదవ, పదవ తరగతి పుస్తకాలు రానున్నాయని తెలిపారు. వీటిని కూడా మరో రెండు రోజుల్లో ఆయా పాఠశాలలకు పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రతి పాఠశాల హెడ్మాస్టర్ తమ పాఠశాలకు పుస్తకాలు వచ్చిన వెంటనే విద్యార్థులకు తప్పక అందజేయాలని తెలిపారు. ఎక్కడ ఎటువంటి ఫిర్యాదులు అంద రాదని తెలిపారు. ఈ మాసాంతం లోపు అన్ని తరగతుల పుస్తకాలను తప్పక విద్యార్థులకు అందవేయడం జరుగుతుందని వారు స్పష్టం చేశారు. అదేవిధంగా 2024-25 విద్యా సంవత్సరంలో సీబీఎస్ఈ సిలబస్సును పట్టణంలోని గుట్ట కింద పల్లి లో గల మోడల్ స్కూల్ కు, అదేవిధంగా మోటు మర్ల లో గల కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయముకు అనుమతి రావడం జరిగిందని తెలిపారు. ఈ రెండు పాఠశాలల్లో విద్యార్థులకు ఒక మంచి అవకాశం లభించడం శుభదాయకమని తెలిపారు. ఈ సీబీఎస్ఈ సిలబస్ ద్వారా విద్యార్థులు విద్యలో మరింతగా రాణించగల అవకాశం ఉందని తెలిపారు. ఈ సీబీఎస్ఈ సిలబస్ ఆరవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు వర్తిస్తుందని తెలిపారు. తదుపరి మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్, కేజీవీబీ ప్రిన్సిపాల్, తమ పాఠశాలలకు సీబీఎస్ఈ సిలబస్ రావడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు.