విశాలాంధ్ర ధర్మవరం:: పర్యావరణ పై ప్రతి ఒక్కరూ అవగాహన కల్పించుకోవలసిన అవసరం ఎంతైనా ఉందని స్పందన హాస్పిటల్ నిర్వాహకులు డాక్టర్ బషీర్, డాక్టర్ సోనియా తెలిపారు. ఈ సందర్భంగా వారు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రజలకు పలు విషయాలను తెలియజేశారు. పర్యావరణం రక్షించుకోపోతే మనుగడ ఉండదని తెలిపారు. పర్యావరణానికి అనుకూలమైన చర్యలు తీసుకోవడానికి అవసరమైన అవగాహనను పెంచుకోవడానికి తప్పక కొన్ని చర్యలు చేపట్టాలని తెలిపారు. ఇప్పటికే మానవ పర్యావరణం పై ఐక్యరాజ్యసమితి సమావేశాలను కూడా నిర్వహించడం జరిగిందని తెలిపారు. భూమి పునరుద్ధరణ, ఎడారీ కరణ, కరువును తట్టుకునే శక్తిపై పర్యావరణం ఆధారపడి ఉందని తెలిపారు. ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం ద్వారా 1973లో ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకలు ప్రారంభించబడ్డాయని తెలిపారు. ఈ పర్యావరణంపై ఇప్పటికే స్వచ్ఛంద సంస్థలతో పాటు ప్రభుత్వాలు కూడా ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఎంతో కృషి చేస్తుందని తెలిపారు. యువతి యువకులు కూడా ఈ పర్యావరణ పై అవగాహన కల్పించుకొని రక్షణ ఇవ్వాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని తెలిపారు.